బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:45 IST)
ఏపీలోని కృష్ణా జిల్లాలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లాలోని కంకిపాడు మండలంలో ఈ ఘటన జరిగింది. ఇది శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 యేళ్ల బాలిక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం తన ఇంటికి వెళ్ళేందుకు బస్టాండులో నిరీక్షిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుంపటి చందు (22), అతని స్నేహితుడు 17తో కలిసి గ్రామానికి వెళుతున్నారు. 
 
బస్టాండులో బాలికను చూడటంతో తనను కూడా ఇంటివద్ద దింపాలని ఆ బాలిక కోరింది. దీంతో సరేనని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి.. రొయ్యూరుకు తీసుకెళ్ళారు. అక్కడ చందు మద్యం సేవించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు... చందుతో అతనికి సహకరించిన మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments