బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:45 IST)
ఏపీలోని కృష్ణా జిల్లాలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లాలోని కంకిపాడు మండలంలో ఈ ఘటన జరిగింది. ఇది శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 యేళ్ల బాలిక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం తన ఇంటికి వెళ్ళేందుకు బస్టాండులో నిరీక్షిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుంపటి చందు (22), అతని స్నేహితుడు 17తో కలిసి గ్రామానికి వెళుతున్నారు. 
 
బస్టాండులో బాలికను చూడటంతో తనను కూడా ఇంటివద్ద దింపాలని ఆ బాలిక కోరింది. దీంతో సరేనని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి.. రొయ్యూరుకు తీసుకెళ్ళారు. అక్కడ చందు మద్యం సేవించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు... చందుతో అతనికి సహకరించిన మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments