Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 2 March 2025
webdunia

ఉజ్జయినిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆటో డ్రైవర్ అరెస్టు

Advertiesment
victim
, గురువారం, 28 సెప్టెంబరు 2023 (17:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పెట్టణ సమీపంలో మైనర్ బాలికపై దారుణ అత్యాచారం ఘటనలో ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆటోలో రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. సదరు ఆటోడ్రైవర్ 38 ఏళ్ల రాకేష్‌గా తెలిపారు. 12 ఏళ్ల బాధిత బాలిక అత్యాచారం తర్వాత అర్థనగ్న స్థితిలో, రక్తస్రావం అవుతుండగా, 8 కిలోమీటర్ల పాటు సాయం కోరుతూ చివరికి ఓ ఆశ్రమాన్ని ఆశ్రయించడం తెలిసిందే.
 
పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఎనిమిది కిలోమీటర్ల పొడవునా సీసీటీవీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీంచారు. వీటిలో జీవన్ భేరి ప్రాంతంలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఘటనకు ఒక రోజు ముందు బాలిక తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
బాలిక ఇంటి నుంచి వచ్చిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురిని కలుసుకున్నట్టు చెప్పారు. బాలిక ఎవరిని అయితే కలుసుకుందో, వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. ఆటోలో రక్తపు మరకలు ఎవరివనేది గుర్తించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
అత్యాచారం తర్వాత బాలిక వీధుల్లో నడుస్తూ కనిపించిన వారిని సాయం కోరినా, ఎవరూ చేయకపోగా, తరిమి కొట్టడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. చివరికి ఓ ఆశ్రమం నిర్వాహకులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికకు తీవ్ర గాయాలు కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ స్మగ్లింగ్.. మనీ లాండరింగే కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు