Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్టిస్ చెప్తుంటే పట్టించుకోరా అంటూ బుకాయింపు... కేటుగాడిని బొక్కలో వేసిన పోలీసులు..

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సోదరి పేరుతో మోసానికి పాల్పపడిన ఓ కేటుగాడిని పోలీసులు జైలుకు పంపించారు. ఆడ, మగ గొంతుతో మాట్లాడుతూ పోలీసులతో పాటు బాధితులను కూడా బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతూ వచ్చిన వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకి చెందిన గొట్టిపాటి సందీప్‌(23) డిప్లొమో చేశాడు. కేపీహెచ్‌బీకి చెందిన ఓ మహిళ విదేశాల్లో వీసా కోసం దళారులకు నగదు ఇచ్చి మోసపోయింది. ఆ వివరాలు తెలుసుకున్న సందీప్‌ ఏపీ హైకోర్టు జస్టిస్‌ తన సోదరి అని, నగదు, వీసా కూడా ఇప్పిస్తానని ఆ మహిళను నమ్మించాడు. మగ గొంతు ఆడ గొంతుగా మారే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. 
 
తొలుత సైబరాబాద్‌ సీపీకి ఫోన్‌ చేసి తాను ఏపీ హైకోర్టు జస్టిస్‌ను మాట్లాడుతున్నానని చెప్పడంతో సీపీ... డీసీపీకి ఫోన్‌ చేయాలని సూచించారు. డీసీపీ నుంచి ఏసీపీ, సీఐ, ఎఎస్ఐలకు వందలసార్లు ఫోన్‌ చేసేవాడు. జస్టిస్‌ చెప్తుంటే పట్టించుకోరా అంటూ మహిళకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు మాట్లాడేవాడు. అదే మహిళ నుంచి భూవివాదం పరిష్కరిస్తానని రూ.50 వేలు వసూలు చేశాడు. సందేహం వచ్చిన పోలీసులు సందీప్‌పై నిఘాపెట్టారు. ఎట్టకేలకు సూడో జస్టిస్‌గా అవతారమెత్తాడని గుర్తించిన పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులు ఆ కేటుగాడిని రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments