Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేసిన ప్రియుడిపై కత్తి - యాసిడ్‌తో యువతిదాడి!

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (08:59 IST)
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరులో ఓ యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిపై కత్తి, యాసిడ్‌తో దాడిచేసింది. కళ్యాణమండపానికి నేరుగా వచ్చిన ఆ యువతి ఈ దాడికి తెగబడింది. మరికొన్ని క్షణాల్లో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్ళి కుమారుడు తనను మోసం చేశాడని చెబుతూ ఓ యువతి అక్కడకు వచ్చి కత్తి, యాసిడ్‌తో వీరంగం చేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారంతా హతాశులయ్యారు. 
 
అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్‌ బాషా, తిరుపతికి చెందిన జయ అనే మహిళ పదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. కొంత కాలం కిందట స్వగ్రామానికి వచ్చేసి ఓ యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఆదివారం వారి వివాహం జరుగుతోందని తెలుసుకున్న జయ.. కార్యక్రమానికి వచ్చి ప్రియుణ్ని నిలదీసింది. 
 
ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోతూ తనతో తెచ్చుకున్న కత్తి, యాసిడ్‌తో అతనిపై దాడి చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో కరీష్మా అనే మహిళపై యాసిడ్‌ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన బాషా.. కత్తితో జయపై దాడి చేయడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. వధువు తరపు బంధువులు పెళ్లిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్‌ జహీర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments