Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

ఐవీఆర్
శనివారం, 15 ఫిబ్రవరి 2025 (12:28 IST)
వావివరసలు మరిచి కన్నతల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొడుకుని హత్య చేయించింది ఓ తల్లి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ప్రకాశం జిల్లా వాస్తవ్యురాలైన సాలమ్మకు నలుగురు పిల్లలు. వీరిలో మూడో కుమారుడు శ్యాంబాబుకి 35 ఏళ్లు. ఐతే ఏ పనీ చేయకుండా మద్యం సేవిస్తూ, దొంగతనాలు చేస్తూ తల్లికి తలవంపులు తెచ్చేవాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాన్నది కూడా తెలియకుండా తప్పతాగి బంధువుల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి మందలించడంతో ఆమె పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
 
కుమారుడి దుష్ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన ఆ తల్లి ఇక అతడిని లేకుండా చేయాలని నిశ్చయించుకున్నది. ఓ ఆటో డ్రైవరుకి సుపారీ ఇచ్చి తన కొడుకును హత్య చేయించింది. ఆటో డ్రైవర్ శ్యాంబాబును తన ఆటోలో ఎక్కించుకుని పూటుగా మద్యం పోయించి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అతడిని హత్య చేసి అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి పంట కాలువలో పడేసాడు. పొలం గట్టుపై రక్తపు మరకలు చూసిన స్థానికులు విషయాన్ని పోలీసులు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన కుమారుడిని హత్య చేయించింది తనేనని తల్లి అంగీకరించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments