Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి తనకన్నా రెండేళ్లు చిన్నవాడితో సహజీవనం, మిస్సింగ్ కేసు పెట్టిన భర్త... అంతే

Webdunia
బుధవారం, 25 మే 2022 (16:17 IST)
తనకంటే రెండేళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమాయణం పెట్టుకుంది ఓ వివాహిత. ఈ వ్యవహారం తెలిసి భర్త మందలించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నది.

 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా రాజీవ్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల వేణుగోపాల్, 26 ఏళ్ల పూజ ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇంట్లో చెప్పలేకపోయారు. దీనితో నాలుగేళ్ల క్రితం పూజకి తన మేనబావనిచ్చి పెళ్లి జరిపించారు. ఐతే అతడితో మనస్పర్థలు రావడంతో అతడికి దూరంగా వుంటూ వస్తోంది.

 
తన ప్రియుడు వేణుగోపాల్ తో తరచూ చాటుమాటుగా కలుస్తూ గంటలతరబడి అతడి వద్ద గడుపుతోంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం చెందిన పూజ భర్త పోలీసు స్టేషన్లో తన భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసాడు. ఇది తెలుసుకున్న పూజ, వేణుగోపాల్ తమ పరువు పోతుందని భావించి ఇద్దరూ కలిసి ఊరికి దూరంగా వున్న అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అటుగా వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments