Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ళ చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (12:47 IST)
కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణకు దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల వెన్నులో వణుకు పుట్టడం లేదు. ముఖ్యంగా ఏపీలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కేంద్రంలో ఎనిమిదేళ్ళ చిన్నారిని బలవంతంగా నిర్మాణంలో ఉన్న ఓ సచివాలయంకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
 
వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా తవణంపల్లె గ్రామానికి చెందిన ఉమాపతి(70) ఏళ్ల వృద్దుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే భార్య మృతి చెందడంతో ఉమాపతి ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ ఎనిమిదేళ్ల బాలికపై ఉమాపతి కన్ను పడింది. 
 
నిన్న సాయంత్రం బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటూ వుండగా.. ఉమాపతి బాలికకు మాయమాటలు చెప్పాడు. చాక్లెట్స్, బాస్కెట్లు ఇప్పిస్తానని ఆశ చూపాడు. కానీ బాలిక వృద్దుడి మాటలను వినకుండా ఆడుకుంటూ ఉండగా, ఎవరూ లేని సమయం చూసి బాలికను బలవంతంగా నిర్మాణంలో ఉన్న సచివాలయం లోనికి తీసుకెళ్లాడు. ఆ తరువాత బాలికను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
 
బాలిక వృద్దుడుని నెట్టి బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నం చేయడంతో బాలిక నోటిని అదిమిపట్టి సచివాలయం లోనికి బలవంతంగా లాక్కెళ్లి ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విని బాలిక తల్లి పరుగులు తీస్తూ సంఘటనా స్థలానికి వచ్చింది. దాంతో ఉమాపతి పరార్ అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments