Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన : ఐఎండీ హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (12:13 IST)
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. అందువల్ల మరో వారం రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది.
 
కాగా, ఈ దఫా ముందుగానే నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 5వ తేదీ జూన్ 10వ తేదీ వరకు తెలంగాణాలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం నెలకొనివుందని తెలిపింది. 
 
ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీతో పాటు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ, కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments