Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన : ఐఎండీ హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (12:13 IST)
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. అందువల్ల మరో వారం రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది.
 
కాగా, ఈ దఫా ముందుగానే నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 5వ తేదీ జూన్ 10వ తేదీ వరకు తెలంగాణాలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం నెలకొనివుందని తెలిపింది. 
 
ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీతో పాటు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ, కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments