Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ కోసం బైకుపై స్టంట్స్ - గాల్లో కలిసిన ప్రాణాలు

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (09:38 IST)
రీల్స్‌ ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు బైకుపై రిస్కీ స్టంట్స్ చేసిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన శుభం, ఆనంద్ కుమార్, సోను కుమార్ అనే ముగ్గురు పదో తరగతి విద్యార్థులు రీల్స్ చేయడానికి బైకుపై ముంగేర్‌లోని జాతీయ రహదారి 80పైకి వచ్చారు. ఆ రహదారిపై వారు అమిత వేగంగా బైకు నడుపుతున్న క్రమంలో రహదారిపై ఆగివున్న బస్సును గమనించకుండా ఢీ కొట్టడంతో శుభం, ఆనంద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోనూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ ముగ్గురు స్నేహితులు బైకుపై రీల్స్ చేస్తున్న సమయంలో బైకు నడుపుతున్న యువకుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకరంగా రీల్స్ చేయొద్దని ప్రచారం చేస్తున్నప్పటికీ యువత తరచూ ఈ విధంగా ప్రమాదాల బారినపడుతున్నారని ముంగేర్ ఎస్పీ ఇమ్రాన్ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments