Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ : భారత్ జట్టులో ముచ్చటగా ముగ్గురు కీపర్లు

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (17:04 IST)
ప్రపంచకప్‌లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మంగళవారం లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఏడు మ్యాచ్‌ల్లో 11 పాయింట్‌లతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. భారత్ తన ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేసే అవకాశం మెండుగా ఉంది. బంగ్లాదేశ్ జట్టుకు ఛేజింగ్ ఓ ఛాలెంజ్ అని చెప్పాలి. 
 
కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి భారత్ తరపున ఏకంగా ముగ్గురు వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ బరిలోకి దిగారు. వారు ధోనీ, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్. ఇది చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. కేదార్ జాదవ్‌కి బదులుగా దినేశ్ కార్తీక్ బరిలోకి దిగగా, శిఖర్ ధావన్, విజయ్ శంకర్‌లకు గాయాలు కావడంతో రిషబ్ పంత్‌కు అవకాశం వచ్చింది. 
 
అందుకే ఈ మ్యాచ్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహించే ముగ్గురు వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్‌లు పాల్గొనడం ప్రత్యేకమైన విషయంగా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా, పాకిస్థాన్‌కు ఇక నిద్రలేని రాత్రులు- బ్రహ్మోస్‌ను పోలిన స్వదేశీ ఐటీసీఎం క్షిపణి రెడీ

భూమ్మీద నూకలున్నాయ్, తృటిలో తప్పించుకున్నాడు (video)

OG: పంజా తరహాలో 14 సంవత్సరాల తర్వాత పవన్ చేసే హైరేటెడ్ సినిమా ఓజీ?

Noida: స్పృహ తప్పి పడిపోయింది.. కొన్ని క్షణాల్లో మృతి.. నా బిడ్డకు ఏమైందని తల్లి?

అంతర్జాతీయ కోస్తా క్లీనప్ దినోత్సవం 2025: క్లీనప్ ఉద్యమానికి HCL ఫౌండేషన్ నేతృత్వం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెద్దన్నయ్య ఓ ఫైటర్.. ఆయనకు రిటైర్మెంట్ లేదు : పవన్ కళ్యాణ్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments