Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 పరుగుల భారీ తేడాతో భారత్ 6వ విజయం... 4 వికెట్లు పడగొట్టిన షమీ

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (22:21 IST)
ప్రపంచ కప్ 2019 పోటీల్లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లోనూ తన విజయ పరంపర సాగించింది. తాజాగా వెస్టిండీస్ పైన ఆడిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్సమన్లను భారత్ బౌలర్లు వెన్ను విరిచారు. మహ్మద్ షమీ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి విండీస్ ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. బుమ్రా 2 వికెట్లు, చాహల్ 2, పాండ్యా 1, యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక విండీస్ ఆటగాళ్లలో చెప్పుకోదగ్గ స్కోరూ ఎవ్వరూ చేయలేకపోయారు. 
 
ఆంబ్రిస్ 31, పూరన్ 28 మినహా మిగిలినవారంతా అత్యంత స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. దీనితో వెస్టిండీస్ 34.2 ఓవర్లకే ఆలౌట్ అయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ మరో ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి వుంది. మరొక్క మ్యాచ్ లో గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments