Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు అత్యుత్తమైన వ్యక్తివి.. నీ ప్రయాణం అద్భుతంగా సాగాలి : కోహ్లీ

Webdunia
గురువారం, 4 జులై 2019 (11:24 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు గుడ్‌బై చెప్పగా, దీనిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. "రాయుడూ.. నువ్వు అత్యున్నతమైన వ్యక్తివి.. నీ ప్రయాణం అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ కోహ్లీ ఓ ట్వీట్ చేశారు. 
 
కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో అంబటి రాయుడు స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్నాడు. అంటే.. ప్రపంచ కప్ కోసం ప్రకటించిన క్రికెటర్లలో ఎవరైనా గాయపడితే ఈ స్టాండ్‌బై ఆటగాళ్ళకు అవకాశం దక్కుతుంది. అయితే, బీసీసీఐ సెలెక్టర్లు అంబటి రాయుడు పట్ల కక్షపూరితంగా నడుచుకున్నారు.
 
వరల్డ్‌ కప్ టోర్నీ కోసం ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా సభ్యుల్లో పలువురు క్రికెటర్లు గాయపడినా అంబటి రాయుడుకు మాత్రం పిలుపురాలేదు. పైగా, ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడని కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్‌ను సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అంబటి రాయుడు బుధవారం ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. 
 
నిజానికి ప్రపంచకప్‌కు రాయుడు ఎంపిక అవుతాడని అందరూ భావించారు. రాయుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే, ప్రపంచకప్ నుంచి రాయుడిని సెలెక్టర్లు పక్కన పెట్టారు. తొలుత శిఖర్ ధవాన్ గాయపడిన తర్వాత అతని స్థానంలో రిషభ్ పంత్‌ను సెలెక్ట్ చేశారు. అనంతరం విజయ్ శంకర్ కూడా గాయపడ్డాడు. ఈ తరుణంలో కూడా రాయుడిని పక్కన పెట్టి... ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. దీంతో, మనస్తాపానికి గురైన అంబటి రిటైర్మెంట్ ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్- పుతిన్ భేటీ సక్సెస్.. ఇక జెలెన్‌స్కీకి, నాటో మిత్రపక్షాలకు ఫోన్ చేసి మాట్లాడుతా

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్

Cherry: సినీ కార్మికుల కోసం నిర్మాతలు కీలక నిర్ణయాలు వెల్లడి

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

తర్వాతి కథనం
Show comments