Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ జట్టుకి పిచ్చెక్కిపోతోంది... జుట్టు పీక్కుంటున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (21:58 IST)
ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్‌ బెర్త్ పైన పాకిస్తాన్ జట్టుకు పిచ్చెక్కిపోతోంది. ఆ జట్టు ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఏదో ఇంగ్లాండ్ జట్టుని భారత జట్టు ఓడిస్తుందనుకుంటే అది కాస్తా ఆవిరయ్యింది. ఇప్పుడు 3వ స్థానంలో వున్న న్యూజీలాండ్ కూడా ఇంగ్లాండుపై ఓడిపోయే స్థితిలో వుంది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలను వమ్ము అవుతున్నాయి. కాగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరుకుని దర్జాగా వెయిట్ చేస్తున్నాయి. 
 
ఇక ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండు జట్లు సెమీ ఫైనల్‌కు పోటీ పడుతున్నాయి. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి. 11 పాయింట్లతో వున్న న్యూజిలాండ్ జట్టు బుధవారం ఇంగ్లాండుతో పోరాడుతోంది. దాదాపు గెలిచే పరిస్థితి లేదు. 10 పాయింట్లతో వున్న ఇంగ్లాండు గెలిస్తే ఆ జట్టుకి 12 పాయింట్లు రానున్నాయి. కనుక ఇంగ్లాండు సెమీస్ లోకి అడుగెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
కాబట్టి పోటీ ఇక న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్యనే వుంటుంది. పాకిస్తాన్ జట్టుకి 9 పాయింట్లు వున్నాయి. బంగ్లాదేశ్ జట్టుపైన పాక్ గెలిచినా న్యూజీలాండ్-పాక్ నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు వుంటాయి. ఓడిపోతే ఇక ఇంటికి వెళ్లడమే. ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments