Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించలేదు : రవిశాస్త్రి

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (15:55 IST)
మహేంద్ర సింగ్ ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించకపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ముఖ్యంగా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన సమయంలో ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించకుండా ఏడో స్థానంలో దించడంపై పలువురు క్రికెటర్లు మండిపడుతున్నారు. 
 
దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ, ఎంతో అనుభవమున్న ధోనీ చివరి ఓవర్లలో క్రీజులో ఉండటం అవసరమని, ఇది సమిష్టి నిర్ణయమని చెప్పారు. 'ఇది టీమ్ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు. వాస్తవానికి ఇది చాలా చిన్న నిర్ణయం. ధోనీ ముందుగానే బ్యాటింగ్ కు వచ్చి, ఔటైపోతే... అది గెలిచే అవకాశాలను దారుణంగా దెబ్బ తీస్తుంది. అతని అనుభవం చివరి ఓవర్లలో చాలా కీలకం. క్రికెట్ చరిత్రలో అత్యున్నత ఫినిషర్ అయిన ధోనీని చివరి ఓవర్లలో ఆడించకపోవడం పెద్ద తప్పే అవుతుంది' అని చెప్పాడు.
 
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇదిలావుండగా, రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ మరో 45 రోజుల పాటు పొడిగించింది. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రిలు బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జట్టు ఓటమిపై సమీక్షను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments