Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : ఇంగ్లండ్ ఫీల్డింగ్.. అయితే ఈ మ్యాచ్ భారత్-పాక్ కన్నా....

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:29 IST)
ప్రపంచకప్ 2019లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. ఇంగ్లండ్ జట్టు గత మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 
 
కాగా ఆస్ట్రేలియా జట్టులో మాత్రం ఆడమ్ జంపా, కౌల్టర్ నైల్ స్థానంలో నాథన్ లియాన్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్ ఆడుతున్నారు. సాధారణంగా ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందంటే అభిమానులు ఎన్ని పనులు ఉన్నా పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతారు. భారత్-పాక్ మ్యాచ్ లాగే మరో రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లను అభిమానులు ఎంతో ఆసక్తితో చూస్తారు. 
 
అదే ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ రెండు దేశాలు ఎప్పుడు పోటీపడినా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఒక విధమైన భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు అంత ఆదరణ లభిస్తుంది. వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రెండు దేశాల మధ్య మంగళవారం జరిగే మ్యాచ్ పట్ల క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments