Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్ ఫోన్‌తో పుర్రె వెనుకభాగంలో కొమ్ములు...

Advertiesment
స్మార్ట్ ఫోన్‌తో పుర్రె వెనుకభాగంలో కొమ్ములు...
, సోమవారం, 24 జూన్ 2019 (14:04 IST)
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారా? ముఖ్యంగా, గంటల కొద్ది తలవంచి స్మార్ట్‌ఫోనునే చూస్తున్నారా? అయితే, మీ పుర్రె వెనుక భాగంలో కొమ్ములు వచ్చివుంటాయి. ఓసారి వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. లేదంటే ప్రాణాపాయం తప్పదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. ఆస్ట్రేలియా పరిశోధకులు. 
 
గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్ చూసేందుకు మెడ భాగాన్ని అలా ఎక్కువసేపు వంచి ఫోన్‌ తెర వైపే చూస్తూ గడపడం వల్ల.. అక్కడి కండరాలపై అదనపు ఒత్తిడి పడి.. పుర్రె వెనుక దిగువ భాగంలో ఎముక పెరుగుతోందని (బోన్‌ స్పర్స్‌) ఆస్ట్రేలియా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రజ్ఞులు వీటిని 'ఎంథియోసోఫైట్స్'గా పేర్కొంటున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ద సన్‌షైన్‌ కోస్ట్‌లో హెల్త్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ షహర్‌, ఆయన సహచరుడు మార్క్‌సేయర్స్‌ 2016లో.. 1200 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయన ఫలితం 2018లోనే 'సైంటిఫిక్‌ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమైనా.. అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పలువురు స్మార్ట్  ఫోన్ వినియోగదారుల్లో ఈ సమస్య ఉత్పన్నంకావడంతో దీనిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రించే ముందు మామిడి పండును తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?