Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి అలా ఘనమైన వీడ్కోలు పలకాలి : ఆకాష్ చోప్రా

సెల్వి
శుక్రవారం, 21 మార్చి 2025 (15:46 IST)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ గత సీజన్‌ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో అతణ్ని రూ.18 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అలాగే రవీంద్ర జడేజా రూ.18 కోట్లు, పతిరన రూ.13 కోట్లు, శివమ్ దూబే రూ.12 కోట్లు, ధోనీ రూ.4 కోట్లు)ని అలాగే అట్టి పెట్టుకుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో సీఎస్కేకు ఆరో టైటిల్‌ అందించే అద్భుత అవకాశం రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఉందని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక వేళ ఇదే ధోనీకి ఆఖరి ఐపీఎల్‌ సీజన్‌ అనుకుంటే... ఆయనకు ట్రోఫీతో ఘనంగా వీడ్కోలు పలికినట్లూ అవుతుందన్నాడు. 
 
ఇదే అంశంపై చోప్రా మాట్లాడుతూ, 'రుతురాజ్‌ గైక్వాడ్‌కు అద్భుతమైన టీమ్‌కు సారథ్యం వహించే అవకాశం దక్కింది. ఐపీఎల్‌ టైటిళ్లు సాధించడంలో ధోనీ వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అతనికి ఉంది. ఈ విషయంలో ఒత్తిడి ఉండే విషయం వాస్తవమే. గత సీజన్‌లో సీఎస్కే విఫలమైంది. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ లాంటి జట్టు ఇలా ప్రతిసారీ టైటిల్‌ గెలుచుకోకుండా సీజన్ ముగిస్తే ఎలా? ధోనీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐపీఎల్‌లో ఆడతాడో తెలియదు. ఒక వేళ ఇదే ఆఖరి సంవత్సరమూ కావచ్చు. అదే వాస్తవమైతే మీరంతా అతడికి ట్రోఫీతో ఘనమైన వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. ఇది రుతురాజ్‌ గైక్వాడ్‌కు అద్భుత అవకాశం' అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

Chief PSR Anjaneyulu: నటి జెత్వానీ వేధింపుల కేసు.. ఆంజనేయులు అరెస్ట్

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments