చిత్తుగా ఓడిన భారత్ : ర్యాంకుల పట్టికలో రెండో స్థానానికి...

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (15:21 IST)
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో 147 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దీంతో తొలి సారి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ దారుణ పరాభవంతో డబ్ల్యూటీసీ ర్యాంకుల పట్టికలో భారత్ స్థానం కూడా పడిపోయింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఈ ఓటమితో రెండో స్థానానికి దిగజారింది. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో తొలి స్థానానికి చేరింది. భారత్ 58.33 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక (55.56) మూడో స్థానంలో ఉంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గిన కివీస్ 54.55 శాతంతో నాలుగుకు చేరింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 54.17 శాతంతో ఐదులో కొనసాగుతోంది. 
 
భారత్ వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఇతర జట్లూ ముందుకు దూసుకురావడంతో భారత్‌కు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల్లో భారత జట్టు తలపడనుంది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్‌. కనీసం 4 టెస్టుల్లో గెలిచి.. మరొక దానిని డ్రాగా ముగించాల్సి ఉంటుంది. ఒక్కటి ఓడినా.. ఫైనల్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments