Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు కోహ్లీ వరల్డ్ కప్ అందిచ్చేనా? (video)

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (14:11 IST)
ఈ నెలాఖరు నుంచి ఐసీసీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్ జరుగనుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం టీమిండియా కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నారు. 
 
అయితే, కోహ్లీకి ఇది మూడో ప్రపంచ కప్. తొలిసారి 2011 ప్రపంచ కప్‌లో ఆడిన కోహ్లీ, 21 ఏళ్లకే వరల్డ్ చాంపియన్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత 2015 వరల్డ్ కప్‌లో ఆడగా ఇపుడు జరిగే టోర్నీలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 
 
అయితే, 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో కోహ్లీ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అటు శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ హెలికాప్టర్ షాట్, గౌతం గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇదే ఇన్నింగ్స్‌లో గంభీర్‌తో, కోహ్లీ అమూల్యమైన 85 పరుగుల భాగస్వామ్యం భారత్ విజయానికి చాలా కీలకం అయ్యింది.
 
ఇకపోతే, 2015 వరల్డ్ కప్‌ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో జరిగింది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో కోహ్లీ 126 బంతుల్లో 107 రన్స్ చేశాడు. భారత్ ఈ మ్యాచ్‌ను 76 పరుగులతో గెలిచింది. కోహ్లీ ఈ టోర్నీలో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వాటి సాయంతో భారత్ తన గ్రూప్‌లో టాప్‌లో నిలిచింది. అయితే ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా వరల్డ్ కప్ టోర్నీ జరుగనుంది. ఇది కోహ్లీకి మూడో ప్రపంచ కప్. కోహ్లీ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. అతడి బ్యాట్‌ నుంచి వరుసగా సెంచరీలు జాలువారుతున్నాయి. కోహ్లీ ఇప్పుడు తన కెరీర్ పీక్స్‌లో ఉన్నాడని క్రీడా నిపుణులు చెబుతున్నారు. భారత జట్టు కూడా పక్కాగా, సమతూకంతో ఉంది. టీమిండియాలో అనుభవజ్ఞులు, యువకుల అద్భుత మిశ్రమం కనిపిస్తోంది. 
 
జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు, అతడు బహుశా తన చివరి వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. కోహ్లీ టీమ్ ఐసీసీ వరల్డ్ కప్ 2019 గెలవగలదా? అభిమానులు మాత్రం ఈ వరల్డ్ కప్ కోహ్లీది, ఇండియాదే అని గట్టిగా నమ్ముతున్నారు. మరి కోట్లాది మంది భారతీయుల కోరికను కోహ్లీ నెరవేర్చుతాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments