Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌కు కరోనా.. లక్షణాలు ఎక్కువగా వుండటంతో.. ఆస్పత్రిలో చేరిక

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (12:17 IST)
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచే సెలెబ్రిటీల వరకు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్పటికే ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రీటీలకు కరోనా సోకింది. అటు క్రికెటర్లపై కరోనా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే సచిన్‌, పఠాన్‌ బ్రదర్స్‌, బద్రీనాథ్‌లకు కరోనా సోకింది. అయితే.. ఇటీవలే కరోనా బారిన పడ్డ సచిన్‌ టెండూల్కర్‌.. ఇవాళ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు సచిన్‌ ప్రకటించారు. త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. 
 
కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సచిన్‌ కోరారు. తన క్షేమం కోరుకునే వారికి ధన్యవాదాలు తెలిపారు సచిన్‌. కాగా.. మార్చి 27న సచిన్‌ కరోనా బారీన పడ్డారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments