Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తొలి జట్టుగా కేకేఆర్ సరికొత్త రికార్డు

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (10:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో కేకేఆర్ జట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ చరిత్రలో మూడు జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 20, పంజాబ్ కింగ్స్‌పై 21 చొప్పున విజయాలు నమోదు చేసుకుంది. అలాగే, సన్‌‍ రైజర్స్‌పై 2023-25 మధ్య వరుసగా 5 మ్యాచ్‌లలో కోల్‌కతా విజయం సాధించడం గమనార్హం. 
 
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా 2023-25 మధ్య వరుసగా ఐదు మ్యాచ్‌లలో హైదరాబాద్ జట్టుపై వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది. కాగా, ఐపీఎల్‌లో రన్స్‌‌పరంగా గురువారం నాటి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్‌కు భారీ ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏకంగా 80 పరుగులు తేడాతో ఓడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments