Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ఎట్టిపరిస్థితుల్లోనూ ఫైనల్‌కు చేరదు : షాహిద్ ఆఫ్రిది

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (08:41 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌‍లో ఏ జట్టు గెలుస్తుందో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది జోస్యం చెప్పారు. భారత్, ఇంగ్లండ్ ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్‌కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. పైగా, భారత్‌ ఫైనల్‌లో అడుగుపెట్టే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. దీనికి కారణం ఇంగ్లండ్ జట్టు కూర్పు చాలా బాగావుందని చెప్పాడు. పైగా, మైదానంలో రాణించే జట్టుకే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. 
 
ఈ మ్యాచ్ ఫలితంపై ఆఫ్రిది ఓ టీవీతో మాట్లాడుతూ, నేటి మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశం 60-65 శాతం ఆ జట్టుకే ఉందని అభిప్రాయపడ్డాడు. రెండు జట్లూ సమానంగా ఉన్నాయని, ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేశాయని చెప్పాడు. అయితే, తన ఆప్షన్ మాత్రం ఇంగ్లండ్‌కే అని చెప్పాడు. 
 
బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్ మెరుగ్గా ఉందన్నాడు. అందువల్ల ఇంగ్లండ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. పైగా, ఇరు జట్లకూ అది అత్యంత కీలకమైన మ్యాచ్ కావడం విజయం కోసం జట్టులోని 11 మంది ఆటగాళ్లు వందకు వంద శాతం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

తర్వాతి కథనం
Show comments