Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ20 వరల్డ్ కప్ : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగకుండా చూస్తాం : ఇంగ్లండ్ కెప్టెన్

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (08:17 IST)
ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల పోరు జరగకుండా చూస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నారు. ఇందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ టోర్నీలో భాగంగా, గురువారం భారత్ ఇంగ్లండ్ జట్ల రెండో సమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితంపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించారు. 
 
ఈ పొట్టి ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. భారత్‌తో తీవ్రంగా పోరాటం చేస్తాం. ఇపుడు భారత్ చాలా పటిష్టంగా ఉంది. చాలా రోజులుగా నిలకడగా రాణిస్తోంది. లోతైన బ్యాటింగ్, బౌలింగ్, విభాగాతలో ఉన్న జట్టు భారత్‌ను అడ్డుకోవడానికి శ్రమించాల్సివుంది. ఇక సూర్యకుమార్ టాలెంట్ అద్భుతం. 
 
ఇప్పటివరకు టోర్నీల్లో వైవిధ్యంగా ఆడుతున్న బ్యాటర్లలో అతడే టాపర్. స్వేచ్ఛగా షాట్లు కొట్టడమే సూర్యకుమార్ అసలైన బలం. అయితే, ఎలాంటి బ్యాటర్ అయినా సరే వికెట్‌గా మారేందుకు అవకాశం ఉంది" అని చెప్పారు. కాగా, ఈ ఫైనల్ పోరు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న వేళ ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments