Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వస్తువులను నిషేధించాలి - కరోనా పాపం చైనాదే : సురేష్ రైనా

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (15:42 IST)
భారత సైన్యంపై అతి కిరాతకంగా దాడి చేసి 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనాపై భారత క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చైనా వస్తువులను తక్షణం నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌పై దాడి చేసిన డ్రాగన్‌ దేశం మన డబ్బుతో నడవకుడదని, చైనా వస్తువులను నిషేధించాలని డిమాండ్ చేశారు. 
 
గాల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందడంతో దేశ వ్యాపంగా చైనా వ్యతిరేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సురేశ్‌రైనా స్పందించాడు. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనానే కరోనా వైరస్‌ను సృష్టించిందని అనుమానం వ్యక్తంచేశాడు. 
 
భారత భూమిని కాపాడేందుకు దేశ సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి వర్ణణాతీతమని అన్నాడు. ‘భారత సైన్యం చాలా బాలమైంది. ప్రతీ ఒక్క భారత జవానుకు సెల్యూట్‌’ అని రైనా అన్నారు. 
 
దేశం తరుపున ఆడుతూ ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయడమే మా కర్తవ్యం. భారత ప్రభుత్వం, బీసీసీఐ అనుమతిస్తే సరిహద్దులోకి వెళ్లి జావాన్లకు సాయం చేస్తాం, ప్రతి సైనికుడి వెంట యావత్తు దేశం ఉందని తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments