Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (10:17 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెటర్లకు నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ను క్వారంటైన్‌కు తరలించారు. వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడారు. దీంతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లలో కరోనా కలకలం రేగింది. 
 
ఇరు జట్ల ఆటగాళ్లకు శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రోహిత్ శర్మ ఫలితం పాజిటివ్‌గా వచ్చినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఓ ట్వీట్ చేసింది. 
 
కరోనా నిర్ధారణ కాగానే జట్టు బస చేసిన హోటల్‌లోనే అతడు క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపింది. కాగా, ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడుతుండడంతో ఇరు జట్లలోనూ ఆందోళన మొదలైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 25 పరుగులు చేశాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments