రోహిత్ శర్మ సెంచరీ రికార్డ్.. అంపైర్‌తో హిట్ మ్యాన్ టాక్..

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (23:04 IST)
బెంగళూరు చిన్నసామి మైదానంలో జరిగే 3-వ టి20 క్రికెట్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌కు భారత జట్టు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. 
 
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 11 బౌండరీలు 8 సిక్సర్లులతో 121 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. ఇంకా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ ఐదవ స్థానంలో నిలిచాడు. అలాగే రోహిత్ శర్మ టీ20ల్లో ఐదేళ్ల తర్వాత శతకం సాధించాడు.
 
ఇకపోతే.. భారత్ -ఆప్ఘన్‌ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అంపైర్ వీరేందర్ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అంపైర్‌ను ఉద్దేశించి రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
ఫరీద్ అహ్మద్ మాలీక్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతి రోహిత్ శర్మ బ్యాట్‌ను తాకి బౌండరీకి వెళ్లింది. అయితే అంపైర్ వీరేందర్ శర్మ లెగ్‌బై‌స్‌గా ప్రకటించాడు. దీంతో నవ్వుతూ అంపైర్‌ను రోహిత్ శర్మ నిలదీశాడు. అంపైర్ కూడా నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

తర్వాతి కథనం
Show comments