Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు.. రవిశాస్త్రి

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు.

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (11:33 IST)
తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. గతంతో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌ను గెలవని టీమిండియా... ఇప్పుడు ఏకంగా సిరీస్‌ను కైవసం చేైసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశాడు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత కుర్రోళ్లు పాదరసంలా కదిలారన్నారు. ఫలితంగా భారత్ నిర్ధేశించిన లక్ష్యం చిన్నదైనప్పటికీ ప్రత్యర్థి జట్టు విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిందన్నారు. 
 
ముఖ్యంగా, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా తెలివైన ఆటగాడని... ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్నీ ఇవ్వలేదని కొనియాడాడు. చివరి టీ20లో బుమ్రా 9 పరుగులకు 2 వికెట్లను కూల్చిన విషయాన్ని శాస్త్రి గుర్తుచేశాడు. 
 
భారత ఇన్నింగ్స్ ముగిశాక... ఆ స్కోరును కాపాడుకోగలమనే భావించామని చెప్పాడు. 8 ఓవర్ల ఈ మ్యాచ్‌లో కేవలం 2 లేదా 3 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందన్నాడు. అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ, పరుగులను నియంత్రించడంలో కోహ్లీ సేన సఫలమైందని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments