Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన పాకిస్థాన్ ఆటగాడు!

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (08:46 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెర్ బాబర్ అజం సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 మ్యాచ్‌లలో అమిత వేగంగా ఎనిమిదివేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగుతూ వచ్చిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. విరాట్ కోహ్లీ మొత్త 243 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, బాబర్ అజం మాత్రం 214 ఇన్నింగ్స్‌లలోనే ఎనిమిది వేల పైచిలుకు పరుగురు చేశాడు. 
 
గురువారం కరాచీ వేదికగా పర్యాటక ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబప్ చెలరేగి సెంచరీ (110 నాటౌట్) చేశాడు. దీంతో తన వ్యక్తిగత రికార్డును నెలకొల్పడమేకాకుండా, జట్టును కూడా గెలిపించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సం చేసింది. 
 
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపును సొంతం చేసుకుంది. మరో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments