Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా జీవితంలో ఓ భాగం : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై రోహిత్ శర్మ

ఠాగూర్
శుక్రవారం, 3 మే 2024 (10:01 IST)
జీవితంలో అన్నీ మనం కోరుకున్నట్టుగా జరగవని, అదంతా జీవితంలో ఓ భాగమని రోహిత్ శర్మ అన్నారు. ఐపీఎల్ 2024 ఫ్రాంచైజీ జట్లలో ఒక్కటైన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాను యాజమాన్యం ఎంపిక చేసింది. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ, జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా జరగవని వ్యాఖ్యానించారు. 
 
"ఇదంతా జీవితంలో ఓ భాగం. మనం అనుకున్నవన్నీ జరగవు. కానీ, ఈ ఐపీఎల్‌ సీజన్ నాకో మంచి అనుభవం. నేను గతంలో కూడా ఇతర కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. పాండ్యా నేతృత్వంలో ఆడటం కూడా అలాగే ఆడాను" అని రోహిత్ చెప్పుకొచ్చారు. ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, గిల్‌క్రిస్ట్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ తదితరుల నేతృత్వంలో ఆడిన విషయం తెల్సిందే. 
 
పరిస్థితులకు అనుగుణంగా మసలుకోవాల్సి వుందన్నారు. పరిస్థితి ఎలా ఉంటే అలా నడుచుకోవాలి. టీం కోసం చేయగలిగినంత చేయాలి. గత నెల రోజులుగా నేను అదే చేస్తున్నాను అని చెప్పారు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు రోహిత్ 10 ఇన్నింగ్స్‌లలో 314 పరుగులు చేశారు. కాగా, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీం కెప్టెన్సీని కోల్పోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఇక అభిమానులైతే నిరాశలో కూరుకుపోయారు. రోహిత్ స్థానంలో ఎమ్‌ఐ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్‌కు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ ఫారమ్‌ను షేర్ చేసిన జనసేన..

మెగాస్టార్‌ చిరంజీవికి సత్కారం.. మళ్లీ నంది అవార్డుల ప్రకటన

ప్రతిరోజూ రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ షట్ డౌన్

కేబినెట్ మీటింగ్.. ఒకే రోజు ఆరు హామీలపై ఆమోదం..

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments