Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2024.. ఆర్సీబీ మ్యాచ్ చూడాలా.. టిక్కెట్ ధర రూ.52,938లు

IPL 2024

సెల్వి

, బుధవారం, 17 ఏప్రియల్ 2024 (12:15 IST)
భారీ టికెట్ డిమాండ్ గురించి తెలుసుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తమ గేట్ కలెక్షన్‌ను పెంచుకోవడానికి సర్జ్ ప్రైసింగ్, డైనమిక్-రేట్ల వ్యూహాలను అవలంబిస్తున్నారు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు సంబంధించిన మ్యాచ్ టిక్కెట్ రేట్లు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. ఓ ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్ ధర ఎంత? రూ. 52,938లు అంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రారంభ హోమ్ గేమ్ కోసం టిక్కెట్ ధర భారీగా పలుకుతోంది.
 
అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఆడే మ్యాచ్ ధర రూ.499లకే లభిస్తోంది. ఇందులో అసలు విషయం ఏంటంటే.. అగ్రశ్రేణి తారలు పాల్గొనే కీలక పోటీలకు భారీ టికెట్ డిమాండ్ గురించి తెలుసుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తమ గేట్ కలెక్షన్‌ను పెంచుకోవడానికి సర్జ్ ప్రైసింగ్, డైనమిక్-రేట్ల వ్యూహాలను అవలంబిస్తున్నారు.
 
 టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి బీసీసీఐ ఫ్రాంఛైజీకి స్వేచ్ఛనిస్తుంది. దీంతో అభిమానులతో స్టాండ్‌లు నిండిపోతున్నాయి. 
 
అయితే ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫ్రాంచైజీలు స్వయంగా ధరను నిర్ణయిస్తున్నాయి. తద్వారా ఫ్రాంచైజీలు అధిక డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి. బెంగళూరులో చౌకైన టిక్కెట్ ధర రూ. 2,300. ఆ విభాగంలో టోర్నమెంట్‌లో ఇదే అత్యధికం. 
 
ఇవి సర్జ్ ప్రైసింగ్ నుండి మినహాయించబడినప్పటికీ, మ్యాచ్ రోజు సమీపిస్తున్న కొద్దీ ఖరీదైన సీట్ల రేట్లు పెరుగుతాయి. ప్రారంభ మ్యాచ్‌లో ఫ్యాన్ టెర్రస్‌పైకి రూ.4,840 నుంచి రూ.6,292కి, కార్పొరేట్ స్టాండ్‌ల టికెట్ ధర రూ.42,350 నుంచి రూ.52,938కి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌లో మాయంకానున్న విరాట్ కోహ్లీ రికార్డు.. ఏంటది?