Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌- సచిన్ రికార్డ్ బ్రేక్.. ముషీర్ ఖాన్ అదుర్స్

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (20:42 IST)
Musheer Khan
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ముషీర్ ఖాన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 136 పరుగుల భారీ సెంచరీ బాదిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు. 
 
19 ఏళ్ల 41 రోజుల వయసులో ముషీర్ ఖాన్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 1994/95 సీజన్ ఫైనల్‌లో పంజాబ్‌పై రెండు సెంచరీలు బాదాడు. అయితే సచిన్ కంటే తక్కువ వయసులోనే ముషీర్ ఖాన్ సెంచరీ బాదడం రికార్డుగా నిలిచింది. 
 
కాగా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 528 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224, రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments