మ్యాచ్‌ల రద్దు.. అలాంటి వారిని ఆదుకునేందుకు సిద్ధం: గణేశ్ అయ్యర్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:06 IST)
భారత దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంతో క్రీడా పోటీలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపైనే ఆధారపడి ఉన్న చిన్నపాటి ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి కష్టాల్లో పడ్డారు. వీరిలో స్థానిక మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించే వారు, స్కోరర్లు ప్రధానంగా ఉన్నారు. 
 
ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు, బీసీసీఐ మాజీ అంపైర్ గణేశ్ అయ్యర్ ముందుకొచ్చారు. క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడంతో కష్టాల్లో పడ్డ వారిని ఆదుకొనేందుకు తన మిత్రులతో కలిసి ఆయన 'లెండింగ్ ఏ హ్యాండ్' అనే సంస్థను ఏర్పాటు చేశారు.
 
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నమెంట్‌లలో అంపైర్లుగా చేసేవారు రోజుకి రూ.2వేలు, స్కోరర్లు రూ.1,500 వేతనంగా అందుకుంటారని ఎంసీఏ తెలిపింది. ఇప్పుడు మ్యాచ్‌లు లేకపోవడంతో వారికి రాబడి లేకుండా పోయింది. వీరిని ఆదుకొనేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశామని అయ్యర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ రూ.2.5లక్షలు విరాళాల రూపంలో వచ్చాయి. ఈ విరాళాలను అందించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అయ్యర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

మద్యపానంతో భార్యాభర్తలు గొడవలు.. నలుగురు సభ్యుల మిస్సింగ్

గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు... దిక్కుతోచని స్థితిలో భారతీయ యాత్రికులు

నా పనులన్నీ వదులుకుని వచ్చి తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు: తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు

తమిళనాడు డీఎంకే ఆర్కే రోజా మద్దతు.. స్టాలిన్‌ను ఆకాశానికెత్తేసింది.. బాబు ఏకిపారేసింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

తర్వాతి కథనం
Show comments