Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ సెకండ్ వేవ్.. ధోనీ తల్లిదండ్రులకు కరోనా... ఆస్పత్రిలో చేరిక

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:17 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అనేకమంది ఆస్పత్రి పాలవుతున్నారు. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ కోరల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లి దేవకీ దేవి, తండ్రి పాన్ సింగ్‌లకు కరోనా సోకింది. దీంతో ఇద్దరినీ రాంచీలోని పల్స్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. 
 
ప్రస్తుతం వీళ్లిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ప్రస్తుతం ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు అతడు సిద్ధమవుతున్నాడు. గతేడాది ఐపీఎల్ తర్వాత ధోనీ నాలుగైదు నెలల పాటు తన కుటుంబంతోనే గడిపాడు. 14వ సీజన్ కోసం మార్చిలో మరోసారి చెన్నై టీమ్‌తో కలిశాడు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments