ధోనీ రిటైర్మెంట్‌పై దివాకర్ ఏమన్నాడు..?

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:42 IST)
కరోనా వైరస్ కరోనా దెబ్బతో ఐపీఎల్‌ వాయిదా పడటం, ఈ నేపథ్యంలోనే ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు రావడం అతని అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. కాగా, ఈ విషయంపై ధోనీ మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ తాజాగా ఓ స్పష్టత ఇచ్చాడు. 
 
మహీకి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ఆలోచనలు లేవన్నాడు. 'మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం కాబట్టి తన క్రికెట్‌ గురించి మాట్లాడుకోం. కానీ, ధోనీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఒక విషయం చెబుతున్నా.. తనకి రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఎటువంటి ఆలోచనలు లేవు. ఐపీఎల్‌ ఆడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. లాక్‌డౌన్‌ కంటే ఒక నెల ముందే చెన్నైలో సాధన మొదలుపెట్టాడు' అని దివాకర్‌ గుర్తుచేశాడు. 
 
ఇక లాక్‌డౌన్‌ సమయంలోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ తన ఫామ్‌హౌజ్‌లోనే ఫిట్‌నెస్‌ కాపాడుకున్నాడని, పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తేశాక సాధన మొదలుపెడతాడని ధోనీ మేనేజర్‌ స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగి సాధారణ రావడంపై ఇది ఆధారపడిందని తెలిపారు. 
 
కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఐపీఎల్‌ నిర్వహణలో జాప్యం చోటు చేసుకొంది. మరోవైపు ఈ టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ బుధవారం మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్‌ లేకుండా 2020ని ముగించబోమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments