Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టూరిజం మేనేజర్ ఊచలు లెక్కిస్తున్నాడు

టూరిజం మేనేజర్ ఊచలు లెక్కిస్తున్నాడు
, బుధవారం, 1 జులై 2020 (16:46 IST)
మాస్క్ పెట్టుకో అన్నందుకు వికలాంగురాలని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదిన నెల్లూరు పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పాపం పండింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
వికలాంగురాలిని అతి దారుణంగా కొడుతున్న విజువల్స్ సి.సి.ఫుటేజ్ ద్వారా మీడియాకు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అప్పటి వరకు స్పందించని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళడంతో విషయం కాస్త మరింత సీరియస్ అయ్యింది.
 
అలాగే టిడిపి నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద భాస్కర్‌ను అరెస్టు చేశారు. అతనికి కోవిడ్-19 పరీక్షలు  చేయించారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే సబ్ జైలుకు తరలించేందుకు సిద్ధమయ్యారు.
 
వికలాంగురాలిపై దాడి ఘటనను వికలాంగుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. దివ్యాంగులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సంఘం నేతలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్‌ టాక్‌పై నిషేధం.. స్వదేశీ మిట్రాన్ యాప్‌కు పెరిగిన డిమాండ్