Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
శనివారం, 21 మే 2022 (13:45 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడుతాడని సీఎస్కే ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
అంతేగాకుండా వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు.
 
గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది. రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు. ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు. 
 
వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు ధోనీ. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్‌గా బరిలోకి దిగుతామని.. సీఎస్కే వేదికగా మ్యాచ్‌లు జరగకపోవడం చెన్నై అభిమానులను నిరాశకు గురిచేసిందని కామెంట్స్ చేశాడు. 

సంబంధిత వార్తలు

Telangana Lok Sabha Election results 2024 Live: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

త్రివర్ణ పతాకంతో 'మా తుజే సలామ్' అంటూ గుండెపోటుతో నేలకొరిగిన రిటైర్డ్ సైనికుడు (video)

తెలంగాణలో టీటీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి? చంద్రబాబు ప్లాన్?

అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ సాహిల్ అరెస్ట్

కడప ఎన్నికల కౌంటింగ్.. 53మంది రౌడీ షీటర్లపై చర్యలు.. ఈసీ సీరియస్

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత కాపురం కూలిపోయింది: బూర సంచలన వ్యాఖ్యలు

తర్వాతి కథనం
Show comments