Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : నేడు పసికూన హాంకాంగ్ జట్టుతో భారత్ ఢీ

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (09:23 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత జట్టు మరో మ్యాచ్ ఆడనుంది. ఇందులో క్రికెట్ పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఇపుడు మలిపోరుకు సిద్ధమైంది. పాక్ మ్యాచ్‌లో కాస్త తబడినట్టు కనిపించిన భారత్.. బుధవారం జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం లేకపోలేదు. 
 
ముఖ్యంగా, టాపార్డర్ గాడినపడేందుకు ఇది ఓ మంచి అవకాశంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగపడనుంది. అదేసమయంలో అగ్రశ్రేణి ఆటగాళ్లతో నిండిన టీమిడింయాతో తలపడటమే హాంకాంగ్ పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా హాంకాంగ్‌తో పోల్చుకుంటే భారత్ బలంగా కనిపిస్తుంది. 
 
అయితే, క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో పట్టుదల కనబర్చిన హాంకాంగ్.. రోహిత్ సేనకు కనీస పోటీని ఇవ్వాలన్న గట్టి సంకల్పంతో బరిలోకి దిగనుంది. అలాగే, పాకిస్థాన్ మ్యాచ్‌లో అమితంగా ఆకట్టుకున్న భారత బౌలర్లు.. బ్యాటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 147 పరుగులు ఓ మోస్తారు లక్ష్యాన్ని ఛేదించేందుకు సైతం భారత జట్టు ఆపసోపాలు పడ్డారు. 
 
కానీ, హాంకాంగ్ మ్యాచ్‌‍లో తమ లోపాలను సరిచేసుకుని ఈ టోర్నీని విజయవంతంగా ముగించాలన్న రోహిత్ సేన కోరుకుంటుంది. అయితే, హాంకాంగ్ జట్టును ఏమాత్రం తేలికగా తీసుకున్నా తప్పు చేసినట్టే. క్రికెట్‌లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments