Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చేతిలో ఓడిపోవడానికి కారణం బాబర్ కెప్టెన్సీనే కారణం : వసీం అక్రమ్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (16:29 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. భారత ఆల్ ‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరానికి చేర్చారు. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమికి ప్రధాన కారణం జట్టు కెప్టెన్ బాబర్ అజం కారణమని పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టాస్ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన అజాం... తొలుత బ్యాట్‌తో రాణించలేకపోయాడనీ, ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటింగ్ వేళ కెప్టెన్సీ పరంగా కూడా ఆకట్టుకోలేక పోయాడని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ళను ఔట్ చేసిన స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను సరైన సమయాల్లో బౌలింగ్‌కు దించడంలో కెప్టెన్‌గా అజం పూర్తిగా విఫలమయ్యాడని అభిప్రాయపడ్డాడు. 
 
మిడిల్ ఓవర్‌లో కాకుండా, ఆఖరులో బౌలింగ్‌కు దింపడం అజం చేసిన పెద్ద తప్పిదాల్లో ఒకటని చెప్పారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నపుడు చివరి ఓవర్లలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం సరైన నిర్ణయం కాదన్నాడు. 

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments