Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రో... నీ కెరీర్ పీక్ స్టే‌జ్‌లో ఉంది.. 12వ స్థానంలో వచ్చినా సెంచరీ బాదేస్తావ్...

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (16:12 IST)
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయగా, ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను కివీస్ జట్టు వైట్ వాష్ చేసింది. ఒక దేశంలో భారత జట్టు ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ ఓడిపోవడం గత 31 యేళ్ళలో ఇదే మొదటిసారి. 
 
అయితే, కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. దీంతో కేఎల్ రాహల్‌ ఆటతీరుపై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆఖరి వన్డేలో భారత్‌ ఓడినా రాహుల్‌ ఇన్నింగ్స్‌ మాత్రం అందరిని ఆకట్టుకుంది. 
 
ఈ నేపథ్యంలోనే ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాహుల్‌ ప్రదర్శనను కొనియాడాడు. 'కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించావ్ బ్రో. నీ కెరీర్‌ ఇప్పుడు పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఇలానే నీ విధ్వంసాన్ని కొనసాగిస్తే 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ సాధిస్తావ్' అనే క్యాప్షన్‌తో రాహుల్ సెంచరీ ఫొటోను షేర్ చేశాడు. ధావన్‌ చేసిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments