Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక.. ఆగస్టు 15 తర్వాతేనా?

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:37 IST)
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక ఇంకాస్త ఆలస్యం కానుంది. మొదట్లో ఈ నెల 13, 14లో ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని భావించినా, ఇందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తి కాలేదు. దీంతో ఇండిపెండెన్స్‌ డే (ఆగస్టు 15) తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని బౌలింగ్‌ లెజెండ్‌ కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామితో కూడిన కమిటీ తెలిపింది.
 
అయితే దీనికి సంబంధించి కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా.. ఒకే రోజులో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. చీఫ్‌ కోచ్‌ కోసం ఆరు మందిని షార్ట్‌ లిస్ట్‌ చేసినట్లు సమాచారం. 
 
''కపిల్‌ కమిటీ టాప్‌–3ని ఎంపిక చేస్తుంది. ఇందులో నెంబర్‌వన్‌లో ఉన్న వారితో బీసీసీఐ మాట్లాడుతుంది. అతను అన్ని నిబంధనలకు ఓకే చెబితే కోచ్‌గా బాధ్యతలు అప్పగిస్తుంది'' అని బోర్డు వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో మాజీ ప్లేయర్లు విక్రమ్‌ రాథోర్‌, ప్రవీణ్‌ ఆమ్రే ముందున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments