Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో పడిన రిషబ్ పంత్.. అభిమానిని హగ్ చేసుకుని..?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (13:24 IST)
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చిక్కుల్లో పడ్డాడు. ఇందుకు కారణంగా ఓ అభిమానిని హగ్ చేసుకోవడమే. క్రికెట్‌ ఆస్ట్రేలియా బయో బుబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించాడని రిషబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మెల్‌బోర్న్‌లో రోహిత్, గిల్‌, సైనీలతో కలిసి పంత్ ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వీళ్ల బిల్లును ఓ అభిమాని చెల్లించాడు. ఆ సందర్భంలోనే పంత్ అతడిని హగ్ చేసుకున్నాడు. 
 
అతడు చెల్లించిన డబ్బును తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతూ.. పంత్ ఇలా హగ్ చేసుకోవడం విశేషం. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా బయో బబుల్ నిబంధనల ప్రకారం ఇలా చేయడం ప్రొటోకాల్ ఉల్లంఘన కిందికే వస్తుంది. క్రికెటర్లు బయటకు వెళ్లవచ్చు, రెస్టారెంట్లలో తినవచ్చు కానీ ఇలా బబుల్‌లో లేని వ్యక్తిని తాకడంపై నిషేధం ఉంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియాతోపాటు బీసీసీఐ కూడా విచారణ జరపనున్నాయి.
 
బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘనలను ఆయా క్రికెట్ బోర్డులు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. గతంలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన క్రికెటర్లను సస్పెండ్ చేయడమో, జరిమానా విధించడమో చేశాయి. మరి రిషబ్ సంగతి ఏమౌతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments