Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇర్ఫాన్‌ పఠాన్‌‌కి కోవిడ్ పాజిటివ్.. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడిన వాళ్లకే..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:37 IST)
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ప్రకటించాడు. 
 
లక్షణాలు లేకున్నా... పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 
 
కాగా.. ఇటీవల రాయ్‌పూర్‌లో ముగిసిన రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే కరోనా సోకుతోంది. ఇప్పటికే ఈ సిరిస్‌లో ఆడిన సచిన్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా పాల్గొనడం విశేషం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments