Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం - అహ్మదాబాద్‌లో ఫైనల్!!

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (19:07 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 టోర్నీ ఈ నెల 17వ తేదీన పునఃప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నగరంలో జరుగనుంది. మరోవైపు, ఈ పోటీలను ఆరు వేదికల్లో మే 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 29 నుంచి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మే 29వ తేదీన క్వాలిఫయర్ -1, మే 30వ తేదీ ఎలిమినేటర్, జూన్ 1వ తేదీన క్వాలిఫయర్-2, జూన్ మూడో తేదీన ఫైనల్ జరుగనున్నాయి. 
 
ఈ మేరకు బీసీసీఐ సవరించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మిగిలిన లీగ్ మ్యాచ్‍ల కోసం జైపూర్ ముంబై, బెంగుళూరు, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలను ఖరారు చేసింది. ఇలా లీగ్ మ్యాచ్‌ల వేదికలు ఇప్పటికే నిర్ణయించినప్పటికీ, ప్లే ఆఫ్‌లను నిర్వహించే వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. 
 
అయితే, తాజా నివేదికల ప్రకారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కోల్‌కతా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ఇక్కడికి మార్పు చేసినట్టు వార్తలు వాస్తున్నాయి. అయితే, వాతావరణ సమాచారం. 
 
బోర్డు ప్రస్తుతం వేదికల వద్ద వర్షం పడే అవకాశాలను పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ ప్రారంభంలో అహ్మదాబాద్‌ల ఎటువంటి వర్షాలు ఉండవని భావించి, ఇదే వేదికలో ఫైనల్ నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ విషయానికి వస్తే ముంబై వేదిక ఒక ఛాయిస్‌గా ఉంది. 
 
కానీ, ఇది దేశంలో రుతుపవనాల రాకపై ఆధారపడి ఉంటుందని క్రిక్‌బజ్ పేర్కొంది. కొన్ని రోజుల క్రితం వాణిజ్య రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. అటు ఇదేసమయంలో వర్షం ప్రభావం అంతగా ఉందని ఢిల్లీ, జైపూర్ వంటి ఉత్తర భారత వేదికలను బీసీసీఐ ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments