Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2024 : చివరి లీగ్ మ్యాచ్‌ టాస్ గెలిచిన పంజాబ్ జట్టు

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (16:28 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో సన్ రైజర్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరింది. తాజాగా పంజాబ్‌పై గెలిస్తే ఆ స్థానాన్ని మరింతగా మెరుగుపరుకోనుంది. అయితే, ఆదివారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌‍లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. 
 
ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికకానుంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ జట్టుకు మొదట బ్యాటింగ్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ జట్టు కెప్టెన్ జితేశ్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
 
కాగా, ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో స్థానం కల్పించారు. అటు పంజాబ్ జట్టులో కెప్టెన్ శామ్ కరన్ సహా చాలా మంది విదేశీ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కోసం తమ జాతీయ జట్లలో చేరేందుకు వెళ్లిపోయారు. దీంతో ఆదివారం సన్ రైజర్స్‌‍తో మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో రిలీ రూసో రూపంలో ఒక్క విదేశీ ఆటగాడు మాత్రమే ఆడుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

తర్వాతి కథనం
Show comments