Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెపాక్ స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్న మాజీ కెప్టెన్!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (13:24 IST)
మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. ఈయన ప్రస్తుతం చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్నారు. ధోనీ ఏంటి క్రికెట్ జట్టుకు రంగులు వేయడం అనే కదా మీ సందేహం... అయితే ఈ కథనం చదవండి. ఐపీఎల్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నెల 31వ తేదీన ప్రాంభమవుతుంది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. 
 
ఇందుకోసం చెపాక్ స్టేడియంలో గత నెల రోజులుగా ధోనీ ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సీఎస్కే క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. రేయింబవుళ్లు ప్రాక్టీస్ చేస్తూ, స్టేడియానికి మరమ్మతులు చేసే పనుల్లో కూడా నిమగ్నమయ్యారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత కొన్ని స్టాండ్లను కూడా ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనున్నారు.
 
ఈ క్రమంలో స్టాండ్స్‌లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments