Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెపాక్ స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్న మాజీ కెప్టెన్!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (13:24 IST)
మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. ఈయన ప్రస్తుతం చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్నారు. ధోనీ ఏంటి క్రికెట్ జట్టుకు రంగులు వేయడం అనే కదా మీ సందేహం... అయితే ఈ కథనం చదవండి. ఐపీఎల్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నెల 31వ తేదీన ప్రాంభమవుతుంది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. 
 
ఇందుకోసం చెపాక్ స్టేడియంలో గత నెల రోజులుగా ధోనీ ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సీఎస్కే క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. రేయింబవుళ్లు ప్రాక్టీస్ చేస్తూ, స్టేడియానికి మరమ్మతులు చేసే పనుల్లో కూడా నిమగ్నమయ్యారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత కొన్ని స్టాండ్లను కూడా ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనున్నారు.
 
ఈ క్రమంలో స్టాండ్స్‌లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments