Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తుగా ఓడిన బెంగుళూరు - అగ్రస్థానంలో రాజస్థాన్

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (07:29 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో తన ఖాతాలో మరో ఓటమిని వేసుకుంది. అదేసమయంలో ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 
 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది. బెంగుళూరు బౌలర్లు రాణించడంతో పరుగులు రావడం గగనమైంది. దీనికితోడు వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫలితంగా ఈ జట్టు ఆటగాళ్లలో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు రెండు అంకెల స్కోరు చేయలేక పోయారు. 
 
అయితే, రియాన్ ఫరాగ్ క్రీజులో పాతుకునిపోవడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. పరాగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంత్రో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ 17, శాంసన్ 27, డరిల్ మిచెల్ 16 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగన బెంగుళూరు జట్టు షరా మామూలుగానే పేలవ ప్రదర్శనతో ఆటను మొదలుపెట్టింది. విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత నుంచి వికెట్ల పతనం కొనసాగింది. 37 పరుగుల వద్ద డుప్లెసిస్ (23), మ్యాక్స్‌వెల్ (0) ఔట్ అయ్యారు. 
 
రాజస్థాన్ బౌలర్లలో ముఖ్యంగా, కుల్దీప్ సేన్, అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా బెంగుళూరు ఆటగాళ్లు వరుసబెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. దినేష్ కార్తీక్ 6, షాబాజ్ అహ్మద్ 17, హసరంగ 18 చొప్పున పరుగులు చేశారు. 
 
గత మ్యాచ్‌లో 68 పరుగులకే కుప్పకూలి ఘోర వైఫల్యానని మూటగట్టుకున్న రాయల్ చాలెంజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శనతో ఓమటి పాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments