Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2021.. మాల్దీవులకు ఆస్ట్రేలియా క్రికెటర్లు..

Webdunia
బుధవారం, 5 మే 2021 (20:30 IST)
ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడుతుండడంతో ఈ లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కొంతమంది ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ఇప్పటికే లండన్‌ బయలుదేరి వెళ్లారు.
 
కరోనా విజృంభణ కారణంగా మే 15 వరకు భారత్‌ నుంచి ప్రయాణికులు ఎవరూ ఆస్ట్రేలియాకు రాకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్‌లో ఉన్న ఆసీస్‌ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆసీస్‌ ఆటగాళ్లు మాల్దీవ్స్‌ మీదుగా తమ దేశానికి వెళ్లాలనుకుంటున్నారు. త్వరలో చార్టర్డ్‌ విమానంలో మాల్దీవ్స్‌కు వెళ్లి, ఆస్ట్రేలియా సరిహద్దులను తెరిచే వరకు అక్కడే వేచి ఉండాలని క్రికెటర్లు నిర్ణయించుకున్నారని ఓ అధికారి బుధవారం తెలిపారు.
 
38 మంది సభ్యుల ఆస్ట్రేలియా బృందంలో ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, వ్యాఖ్యాతలు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని దేశంలోకి అనుమతించే వరకు మాల్దీవ్స్‌లోనే ఉండటానికి ఆసక్తి చూపించారు. ‘ఆస్ట్రేలియన్లు అందరూ ఇవాళ ఢిల్లీలో కలుసుకుంటారు. అక్కడి నుంచి వారంతా చార్టర్డ్‌ ఫ్లైట్‌ ద్వారా మాల్దీవులకు వెళతారని’ కేకేఆర్‌ అధికారి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments