Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు మహిళా వీరాభిమాని ఇకలేరు.. బీసీసీఐ సంతాపం

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (14:53 IST)
భారత క్రికెట్ జట్టుకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. కానీ, ఆ 87 యేళ్ళ వృద్ధ మహిళా వీరాభిమానం మాత్రం ప్రత్యేకం. ఆమె జట్టు పట్ల చూపుతున్న ప్రేమకు టీమిండియాకు చెందిన అగ్ర క్రికెటర్లు ఫిదా అయిపోయారు. ఆమెతో ప్రత్యేకంగా సమావేశమై, ముచ్చటించారు. అలాంటి వీరాభిమాని ఇకలేరు. ఆమె లండన్‌లో మృతిచెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చారులత పటేల్. వయసు 87 యేళ్ళు. పుట్టింది పెరిగింది విదేశాల్లోనే. కానీ మాతృదేశంపై ఆమెకు వల్లమానిని ప్రేమ, మమకారం. అందుకే భారత క్రికెట్ జట్టు విదేశాల్లో ఆడే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా ఆడుతూ ఉంటుంది. 
 
ఈమె తొలిసారి 1983లో లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అపుడు చారులత స్టేడియంలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఇంగ్లండ్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతూ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ వస్తోంది. 
 
అ తర్వాత గత యేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లకు ఆమె హాజరవుతూ వచ్చింది. ఆ వయసులో కూడా ఆమె ఆనందం, ప్రోత్సాహం చూసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు ప్రత్యేకంగా ఆమెను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇటీవల అనారోగ్యంపాలైన ఆమె కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
భారత సంతతికి చెందిన చారులత, పుట్టింది, పెరిగిందీ విదేశాల్లోనే. 1975 నుంచి బ్రిటన్‌లో స్థిరపడిన ఆమె, అంతకుముందు దక్షిణాఫ్రికాలో ఉండేవారు. చారులత పటేల్ మృతిపట్ల బీసీసీఐ సంతాపాన్ని తెలిపింది. ఆమె ఎల్లప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments