రెండో టెస్ట్ : వెస్టిండీస్ లక్ష్యం 468 రన్స్

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (16:48 IST)
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్టు జట్టు ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన.. రెండో టెస్టులో కూడా 468 రన్స్‌ను లక్ష్యంగా ఉంచింది. 
 
భారత క్రికెట్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 157/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా విండీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు, కెప్టెన్ కోహ్లి త్వరగా ఔటయినప్పటికీ, సిరీస్ సెంచరీ హీరోలు రహానే(64), విహారీ(53) శతక(111) భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 
 
విండీస్ స్పీడ్‌స్టర్ కీమర్ రోచ్ కోహ్లి సహా ఓపెనర్లను త్వరగానే పెవిలియన్ పంపించాడు. కోహ్లీని గోల్డెన్ డకౌట్ చేశాడు. అయినప్పటికీ వైస్ కెప్టెన్ రహానే.. విహారీతో ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. భారత్ 157 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 
 
468 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన విండీస్ మూడో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 45/2తో నిలిచింది. విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 423 పరుగులు సాధించాలి. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంత భారీ టార్గెట్ సాధించడం దాదాపు అసాధ్యం. దుర్భేధ్యంగా ఉన్న ఇండియా పేస్ దళాన్ని తట్టుకోవడం విండీస్‌కు కష్టమే. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి ప్రియుడు అఖిల్, వీడియో వైరల్

గుండెపోటుతో మరో యువకుడు కన్నుమూత, తల్లి ఒడిలో తలపెట్టుకుని శాశ్వత నిద్రలోకి...

వరుడి మెడలో దండ వేయబోతున్న ప్రేయసిని తుపాకీతో కాల్చిన ప్రియుడు, వీడియో వైరల్

హైదరాబాద్: 48 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం అదైవుంటుందా?

భారత్-పాక్ యుద్ధాన్ని నేను అడ్డుకోకపోతే పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒడియన్ మాల్, హైదరాబాద్‌లో కొత్త 8- స్క్రీన్ సినిమాను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్

Bhogi: శర్వా, సంపత్ నంది చిత్రం భోగి నుంచి మాస్సీ రగ్డ్ ఫస్ట్ లుక్

Naga Chaitanya: మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ నాగ చైతన్య ఫస్ట్ లుక్

SS Rajamouli: వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రపంచ స్థాయి టెక్నాలజీ : ఎస్‌.ఎస్‌ రాజమౌళి

Sri Vishnu: ఫస్టాఫ్ యూత్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సినిమా : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments