Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామిల్టన్ ట్వంటీ20 : భారత్ ముంగిట 213 లక్ష్యం

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (14:17 IST)
హామిల్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ముంగిట 213 పరుగుల విజయలక్ష్యాన్ని ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ముంచింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు.

ముఖ్యంగా, సీఫెర్ట్, మన్రో, గ్రాండ్‌హోం వంటి ఆటగాళ్లు చెలరేగిపోవడంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు సీఫెర్ట్, మన్రో 7.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. మన్రో కేవలం 40 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 5 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. మరోవైపు సీఫెర్ట్ కూడా కేవలం 25 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. 
 
అత్యంత ప్రమాదకారిగా కనిపిస్తున్న అతన్ని ధోనీ ఓ మెరుపు స్టంపింగ్‌తో ఔట్ చేశాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ తప్ప మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కృనాల్ పాండ్యా అయితే 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ 4 ఓవర్లలో 44 పరుగులు, భువనేశ్వర్ 37 పరుగులు, ఖలీల్ అహ్మద్ 47 పరుగులు ఇచ్చారు. 
 
కుల్దీప్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. గ్రాండ్‌హోమ్ 30, విలియమ్సన్ 27 పరుగులు చేశారు. కివీస్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలవాలని అనుకుంటున్న టీమిండియాకు ఈ భారీ స్కోరు చేజ్ చేయడం పెద్ద సవాలే. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments